BRS పెట్టిన డబ్బులు ఏమయ్యాయ్: కిషన్ రెడ్డి
TG: గ్రామాల్లో ఉండే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్లో లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్కు BRS హయాంలో చేసిన ఖర్చుపై నిన్న KTR చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి స్పందించారు. బోరబండలో కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదని.. మరి BRS ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడ పోయాయో? అని ప్రశ్నించారు. కేవలం మజ్లిస్ మెప్పు పొందేందుకే రేవంత్ ప్రయత్నిస్తున్నారన్నారు.