శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్

శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్

శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు కేరళ అటవీ అధికారులు కీలక సూచన చేశారు. సన్నిధానానికి సమీపంలో ఉన్న ఉరళ్‌కుళి జలపాతాన్ని సందర్శించొద్దని సూచించారు. వన్యప్రాణుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో అప్రమత్తమైన అటవీ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.