తాగునీటి సరఫరాపై మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సమీక్ష

తాగునీటి సరఫరాపై మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సమీక్ష

సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలోని 330 గ్రామాలకు శ్రీరామిరెడ్డి పథకం ద్వారా తాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. ఉద్యోగుల వేతన సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.