విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే..?
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.5,69,047 ఆదాయం వచ్చిందిని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 667 మంది స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. 71 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనగా, 4,300 మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఆయన పేర్కొన్నారు.