నేటి నుంచి కదిరి పౌర్ణమి మహోత్సవాలు
CTR: పుంగనూరు మండలం గుట్టపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కదిరి పౌర్ణమి మహోత్సవాలు సోమవారం నుంచి 2 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం స్వామివారికి అభిషేకాలు, హోమాలు రామకోటి మహా యజ్ఞం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరిచారు. భక్తాదులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.