బీటీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో

బీటీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో

కృష్ణా: పెడన మండలంలోని అచ్చయ్యవారిపాలెం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఎంపీడీవో అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరు పంచాయతీ కార్యదర్శి జానకి పాల్గొన్నారు.