వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన లీలాకృష్ణ

కోనసీమ: రాష్ట్ర ప్రజలు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు మండపేట నియోజకవర్గ ఇంఛార్జ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ బుధవారం వినాయక చతుర్థి పండగ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలంతా ఐకమత్యం, ఆనందంతో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు.