'భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండండి'

MBNR: జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో మిడ్జిల్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. పాత ఇళ్లలో ఉండేవారు తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. చెరువులు, వాగుల దగ్గరికి వెళ్ల కూడదని చెప్పారు. తడిచేతులతో లైట్లను ఆన్ చేయొద్దని తెలిపారు. రోడ్లపై ఉన్న స్తంభాలను తాకవద్దని ఎస్సై శివ నాగేశ్వర్ సూచించారు.