ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
KNR: హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(కుమర్వాడి), సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తనిఖీ చేశారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు తగిన సూచనలు చేశారు. పదో తరగతి పరీక్షలు పక్కాగా నిర్వహించాలని, ఎక్కడా తప్పులు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.