డయేరియా.. 20 మందికి పైగా ‎అస్వస్థత

డయేరియా.. 20 మందికి పైగా ‎అస్వస్థత

PLD: ఈపూరు (M) పోనుగోటివారిపాలెంలో వారం ‎రోజులుగా అతిసార విజృంభిస్తోంది. వాంతులు, ‎విరేచనాలతో సుమారు 20 మందికి పైగా గ్రామస్థులు ‎అస్వస్థతకు గురవడంతో కలకలం రేగింది. బాధితులు ‎నరసరావుపేట, ముప్పాళ్ల ఆసుపత్రుల్లో చికిత్స ‎పొందుతున్నారు. తాగునీరు కలుషితం కావడం ‎వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు భావిస్తున్నారు.