పర్యాటక హబ్గా పల్నాడు
PLD: పల్నాడులోని పర్యాటక ప్రాంతాలను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. గురువారం ఆమె పర్యాటక పనులపై సమీక్షించారు. సాగర్, కొండవీడు, కోటప్పకొండ, అమరావతిలో పనులు వేగవంతం చేయాలన్నారు. బోటింగ్, సౌండ్ అండ్ లైట్ షో త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. యాత్రా కేంద్రాల్లో పరిశుభ్రత, వసతులపై దృష్టి సారించాలని సూచించారు.