'స్కూల్ బస్సుల్లో లోపాలుంటే ఫిర్యాదు చేయండి'
SDPT: ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలపై ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల బస్సు భద్రత పట్ల తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలన్నారు. పాఠశాల యాజమాన్యాలు తప్పనిసరిగా ఆర్సీ, ఫిట్నెస్ కలిగి ఉండాలని, బస్సు వేగం 40 కి.మీ.కంటే మించరాదని సూచించారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే వెంటనే ఆర్టీవో లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.