కన్హా శాంతివనాన్ని సందర్శించిన చంద్రబాబు
RR: చేగూరులోని కన్హా శాంతివనాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం నాడు సందర్శించారు. శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ చంద్రబాబకు స్వాగతం పలికారు. కన్హా శాంతి వనంలో చంద్రబాబు, దాజీ మధ్య ప్రత్యేక భేటీ జరిగింది. ఈ సందర్భంగా కన్హా శాంతివనంలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అడిగి తెలుసుకున్నారు.