అగళిలో పట్టు రైతులకు అవగాహన శిబిరం

అగళిలో పట్టు రైతులకు అవగాహన శిబిరం

SS: అగళి మండలం దాసేగౌడనహళ్లిలో పట్టు రైతులకు మంగళవారం అవగాహన శిబిరం జరిగింది. అనంతపురం ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డా. రమ్య, మురళి, జాయింట్ డైరెక్టర్ శోభారాణి, సహాయ సంచాలకులు హనుమంతరాయలు పాల్గొని మల్బరీ ఆకుల దిగుబడి, నాణ్యత, తెగుళ్లు, వ్యాధుల నివారణపై సూచనలు ఇచ్చారు. అధిక దిగుబడికి అవసరమైన మెళకువలను రైతులకు వివరించారు.