రేపు పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ప్రవేశ పరీక్ష

MHBD: పేద విద్యార్థులకు హైదరాబాద్లోని ప్రగతి విద్యాలయంలో 5, 6, 7 తరగతుల్లో ఉచిత విద్యను అందించేందుకు ఈ నెల 5న జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో ప్రవేశ పరీక్ష జగనుంది. పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్టు నిర్వహించే ఈ పరీక్ష యూటీఎఫ్ జిల్లా కమిటీ అధ్వర్యంలో జరుగుతుందని సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ. మురళి కృష్ణ, యాకుబ్ తెలిపారు.