నేర స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
కడపలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన హత్య ఘటనపై జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన వివరాలు తెలుసుకుని, దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని అధికారులకు ఆదేశించారు. శాస్త్రీయ సాక్ష్యాలతో కేసును బలపరచి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.