ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా
ADB: భీంపూర్ మండలంలోని అందర్ బంద్ ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతలేని ఆహార పదార్థాలను తిరిగి పంపించాలని అధికారులకు సూచించారు.