నిర్లక్ష్యం కాటేసింది.. ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి
SRPT: యజమాని నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వల్లభాపురం శివారులోని ఇటుక బట్టీలో మట్టి తొక్కుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ పల్లపు రాజు(40) అక్కడికక్కడే మృతి చెందాడు. కండిషన్ లేని వాహనాన్ని నడపాలని యజమాని చల్లా నాగరాజు ఒత్తిడి చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈరోజు నిందితుడిని రిమాండ్కు తరలించారు.