2029 నాటికి పేదలందరికీ సొంత ఇల్లు: CM
AP: వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని దివాళా తీయించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. 'ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. 4.73 లక్షల ఇళ్లను రద్దు చేశారు. మేం ఒక్కరోజే 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు చేయిస్తున్నాం. 2029 నాటికి పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలి. మొత్తంగా రూ.21 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. 21 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం' అని వెల్లడించారు.