విద్యుత్ శాఖపై మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష
ATP: అనంతపురంలోని APSPDCL కార్యాలయంలో మంగళవారం విద్యుత్ శాఖ అభివృద్ధి పథకాలపై మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థలో మరింత పురోగతి రావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శేషాద్రిశేఖర్, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు.