VIDEO: వాడపల్లి ఆలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది మహా పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు నూతన సంవత్సరానికి సంబంధించిన పంచాంగ ఫలితాలను విశదీకరిస్తూ, ప్రజల ఆర్థిక, వ్యవసాయ, వర్షపాతం, సామాజిక పరిస్థితులపై విశ్లేషణ చేశారు.