సిబ్బంది కొరతతో కల్తీ కోరల్లో ఆహారం
ATP: జిల్లాలో ఆహార కల్తీపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. హోటళ్లు, దాబాల్లో నాసిరకం నూనెలు, హానికర రంగులు వాడుతుండటంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. అయితే, జిల్లాలో ఫుడ్ తనిఖీ కోసం కేవలం ఒక్కరే ఆహార భద్రతా అధికారి ఉండటం గమనార్హం. సిబ్బంది కొరత అక్రమార్కులకు వరంగా మారింది. ఖాళీలను భర్తీ చేసి తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.