ఈనెల 3న ఉద్యోగ మేళా

ఈనెల 3న ఉద్యోగ మేళా

కాకినాడ కలెక్టరేట్ లోని వికాస కార్యాలయంలో ఈనెల 3న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు పీడీ కె. లచ్చారావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించనున్నటు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులై 35 ఏళ్లలోపు అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారు. ఆరోజు ఉదయం 9 గంటలకు సరైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.