ఏప్రిల్ ఒకటి వరకు నిషేధ ఆజ్ఞలు: సీపీ

ఏప్రిల్ ఒకటి వరకు నిషేధ ఆజ్ఞలు: సీపీ

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి- మంచిర్యాల్ జిల్లాలలో ఏప్రిల్-1 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదన్నారు. అలాగే డ్రోన్లు, డీజే సౌండ్స్ కు ఎలాంటి అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.