మన యశ్వంత్కు రూ.2.5కోట్ల జీతం

అన్నమయ్య: రైల్వే కోడూరుకు చెందిన యువకుడు రూ.కోట్లలో జీతం సంపాదిస్తున్నాడు. పట్టణంలోని సూర్యానగర్కు చెందిన యశ్వంత్ ఖరగ్పూర్ IITలో బీటెక్ చదివాడు. అక్కడ క్యాంపస్లో ఉన్నప్పుడే ఏడాదికి రూ.కోటి జీతంతో అమెరికాకు చెందిన ఓ ఏఐ కంపెనీలో చేరాడు. ఏఐపై మరింత పట్టుసాధించడంతో కాలిఫోర్నియాకు చెందిన మరో కంపెనీ ఏడాదికి రూ.2.5 కోట్ల జీతంతో అతడిని చేర్చుకుంది.