25న చిల్లకూరులో పింక్ బస్ క్యాంపులు

TPT: చిల్లకూరు, కోట మండలం చిట్టేడులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈనెల 25వ తేదీ పింక్ బస్ క్యాంపులు నిర్వహిస్తామని డాక్టర్లు షాలోమ్ అరాఫత్, జి.నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు స్విమ్స్ ఆధ్వర్యంలో బీపీ, షుగర్తో పాటు నోటి, రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తామని చెప్పారు. ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ తీసుకుని రవాలన్నారు.