పౌరసరఫరాలపై నిరంతర నిఘా ఉంచాలి: కలెక్టర్
HNK: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధ్యక్షతన శుక్రవారం సివిల్ సప్లైస్ విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తరచుగా దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ విభాగం క్షేత్రస్థాయిలో నిఘా పెంచాలని సూచించారు. సమావేశంలో అ.కలెక్టర్ రవి, DCSO వాజిద్ అలీ, కమిటీ సభ్యురాలు అనిత రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.