VIDEO: శ్రీక్షేత్రంలో అమ్మవారికి 'లక్ష కుంకుమార్చన'
VZM : ప్రముఖ భారతీయ తత్త్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువైయున్న అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిపారు. అర్చకులు చామర్తి రమేష్, శ్రీనివాస్ ఆచార్యులు ఆధ్వర్యంలో సురేష్, సుమలత దంపతులు ఈ పూజలు చేశారు. కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులు,భక్తులు పాల్గొన్నారు.