రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
KRNL: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని అన్ని మండల, డివిజినల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. ప్రజలు సద్వినియొగం చేసుకోవాలని తెలిపారు.