నేడు భారత్ బంద్
మావోయిస్టు పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. మావోయిస్టు కమాండర్ మాద్వి హిడ్మా ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా ఈ నిరసనను చేపడుతున్నట్లు తెలిపింది. చికిత్స కోసం విజయవాడకు వచ్చిన హిడ్మాను అరెస్ట్ చేసి, బూటకపు ఎన్కౌంటర్ చేశారని పార్టీ ప్రతినిధి అభయ్ ఆరోపించారు. కాగా, బంద్ పిలుపు నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.