విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ
సత్యసాయి: పెనుకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనుకొండ శాఖ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు అందజేశారు. విద్యార్థుల్లో క్రీడా ప్రోత్సాహం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యులు రాఘవయ్య బ్యాంకు మేనేజర్ మహేష్కు ధన్యవాదాలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు.