యాదాద్రి స్వామివారికి వైభవంగా మొక్కు జోడు సేవ
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి వెండి మొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం స్వామివారి గరుఢ వాహనంపై, అమ్మవారు తిరుచ్చిపై వేంచేశారు. అనంతరం మాఢ వీధుల్లో మంగళ వాయిద్యాలతో నేత్రపర్వంగా ఊరేగించి, మంగళ నీరాజనాలు సమర్పించారు. జోడు సేవలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.