మారకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన
JN: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తరిగొప్పుల మండలంలోని మరియాపూర్, సోలిపురం, పోతారం గ్రామాల్లో మాదకద్రవ్యాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నర్మెట్ట సీఐ తరిగొప్పుల ఎస్సై, పోలీస్ సిబ్బందితో పాటు రెవెన్యూ, మెడికల్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.