12వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష
BDK: కాంట్రాక్ట్ కార్మిక సంఘాల JAC ఆధ్వర్యంలో 12వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. సోమవారం జరిగిన ఈ దీక్షలో వేతన ఒప్పంద చర్చలు JACతోనే జరపాలని కన్వీనర్ పాటి సోమిరెడ్డి డిమాండ్ చేశారు. సింగరపు సతీష్, కోడూరు శ్రీనివాసరావు, సందిపాము బాబు, మేకల శేషమ్మ, పడాల మధు, గూడూరు సత్యవతి ఈ నిరసనలో పాల్గొన్నారు. చర్చలు జరపకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.