రేపు ఉపాధి హామీ పనులపై ప్రజా వేదిక

రేపు ఉపాధి హామీ పనులపై ప్రజా వేదిక

SKLM: టెక్కలి మండలం పరిధిలోని 28 గ్రామ పంచాయతీల్లో 01.04.2024 నుంచి 31.03.2025 వరకు అమలైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై బుధవారం సామాజిక తనిఖీల ప్రజా వేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం. రేణుక మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉ.10 కు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.