'ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలి'
KRNL: ప్రజలు ఆధ్యాత్మిక భావనను అలవర్చుకుని భగవంతుని అనుగ్రహం పొందాలని MP బస్తిపాటి నాగరాజు సూచించారు. ఇవాళ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా కర్నూలు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కోల్స్ చర్చి ఆవరణంలో నిర్వహించిన “రన్ ఫర్ జీసస్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మికత మనసుకు శాంతి, సమాజానికి ఐక్యతను అందిస్తుందన్నారు.