రూ.225 కోట్లతో బాసర ఆలయ అభివృద్ధికి శ్రీకారం
TG: బాసర జ్ఞానసరస్వతి ఆలయ అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 2 వేల చదరపు అడుగుల్లో ప్రస్తుత గర్భాలయం, అర్ధ మండపం, 5 వేల చదరపు అడుగులకు పెంచేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు నిర్మించనున్నారు. శృంగేరి పీఠాధిపతులను సంప్రదించి నమూనా తయారు చేశారు.