నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
KKD: ఏవీ నగరం సబ్స్టేషన్లో విద్యుత్ మరమ్మత్తు పనుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 33/11 కేవీ ఏవీ నగరం సబ్స్టేషన్లో కొత్త బ్రేకర్ ఏర్పాటు పనులు జరుగుతున్నందున, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 కేవీ ఆరడబ్ల్యూఎస్ ఫీడర్కు సంబంధించిన ఏవీనగరం గ్రామం, రొయ్యల చెరువులకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.