ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన ఎస్పీ
BPT: అర్జీలను చట్ట పరిధిలో విచారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ తెలిపారు. ఎస్పీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నారు.