ఓటమిపై స్పందించిన గంభీర్
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో తమ ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. పిచ్ క్యూరేటర్ను నిందించాల్సిన అవసరం లేదని, తాము కోరుకున్నట్లుగానే ఈ వికెట్ ఉందని తెలిపాడు. కానీ తమ ఆటగాళ్లే పిచ్కు తగ్గట్లుగా ఆడలేకపోయారని చెప్పాడు. పిచ్ ఎలా ఉన్నా.. 124 పరుగులు లక్ష్యం ఛేదించాల్సిందని అభిప్రాయపడ్డాడు.