గోనె సంచిలో మృత దేహం లభ్యం

కృష్ణా: గూడూరు మండలం కంకటావలో శుక్రవారం సాయంత్రం పొదల మాటున గోనె సంచిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. గోనెలో మృత దేహాన్ని చూసి స్థానికులు భయాందోనకు గురయ్యారు. మృతుడు అదే గ్రామానికి చెందిన యజ్ఞ (37)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.