తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
AP: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా.. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీనివాసుడిని 70,044 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారికి 25,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.47 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.