కావలిలో అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్లు అరెస్ట్
NLR: సైబర్ నేరాలకు పాల్పడే అంతరాష్ట్ర నేరగాళ్లో ముగ్గురిని కావలి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారందరూ బీహార్లోని జాంతారా జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కావలికి చెందిన ఓ వ్యక్తికి ఫోన్లో ఆర్టీవో ఈ-చలానా APK ఫైల్ పంపారు. ఆ వ్యక్తి ఫైల్ను క్లిక్ చేసాడు. దీంతో క్షణాల్లో అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.24 లక్షలు దోచేశారు.