30 తులాల బంగారం, లక్ష నగదు చోరీ

ASF: జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి 30 తులాల బంగారం, లక్ష నగదు చోరీ చేశారు. రాజంపేట కాలానికి చెందిన పద్మ సత్యనారాయణ స్వామి పూజ కోసమని శనివారం ఇంటికి తాళం వేసి సమీప గ్రామమైన గుడికి వెళ్లింది. రాత్రి ఆలస్యం కావడంతో అక్కడే ఉండిపోయింది. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి దొంగతనం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.