బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
HYD: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి మేడ్చల్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద శిక్షతో పాటు జరిమానాలు విధించగా, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.