కందుకూరు నూతన సబ్ కలెక్టర్

NLR: కందుకూరు నూతన సబ్ కలెక్టర్గా దామెర హిమవంశీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఏ సమయంలోనైనా ప్రజలు తనను కలిసి సమస్యలు వివరించవచ్చన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు నూరు శాతం సాధించేలా పనిచేస్తానని చెప్పారు. నూతన సబ్ కలెక్టర్కు రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.