'సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి'
MHBD: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వివిధ ప్రభుత్వ ఏజెన్సీల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేనన్ ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ఆశచూపి మోసం చేస్తున్నారన్నారు. మొబైల్కి వచ్చే OTP అపరిచితులకు చెప్పవద్దన్నారు.