టీచర్ మృతదేహనికి నివాళులు అర్పించిన హోం మంత్రి
VSP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరంలో నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనం కూలి టీచర్ జోష్నా భాయ్ మృతి చెందింది. టీచర్ జోష్నా భాయ్ పార్థివదేహానికి పూలమాలలు వేసి హోం మంత్రి అనిత నివాళులు అర్పించారు. టీచర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆమె పిల్లల చదువు ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.