VIDEO: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ .. 11 మందికి గాయాలు

HNK: శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 36 మందిలో 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.