'సభ్యత్వ నమోదు గడువు ముగుస్తుంది'
E.G: నిడదవోలులో జనసేన నేత తోపురాల కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు శిబిరాన్ని సోమవారం మంత్రి కందుల దుర్గేశ్ సందర్శించారు. మంగళవారంతో సభ్యత్వ నమోదు గడువు ముగుస్తుందని, నియోజకవర్గ వ్యాప్తంగా విశేష స్పందన లభించిందని దుర్గేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడ్డాల నాని, గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.